BRS, ఎంఐఎం మద్దతు వల్లే… ప్రీతి లాంటి ఘటనలు – బండి సంజయ్

-

BRS, ఎంఐఎం మద్దతు వల్లే… ప్రీతి లాంటి ఘటనలు అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణం అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోందని..ఇది ముమ్మాటికీ హత్యే. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం అని నిప్పులు చెరిగారు. మీరిచ్చే రూ.10 లక్షల సాయం… ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? ప్రీతి చావుకు కారకుడైన మనిషికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.

ఈ దారుణ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు.గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటన అద్దం పడుతోందని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులుసహా ఎంతో భవిష్యత్తు ఉన్న పసిపిల్లలు, విద్యార్థులు చనిపోవడం అత్యంత దుర్మార్గమన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version