బండ్ల గణేష్ కి జైలు శిక్ష..!

-

సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష పడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు రెండు అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ పీ. బాను సాయి జైలు శిక్షని, జరిమానాని విధించారు. జెట్టి వెంకటేశ్వర్లు అనే అతనికి బండ్ల గణేష్ 95 లక్షలు చెల్లించాల్సి ఉండగా దానికి సంబంధించి నగదు ని చెక్కు రూపంలో ఇచ్చారు.

వెంకటేశ్వర్లు చెక్ ని నగదుగా మార్చుకోవడానికి బ్యాంకు కి తీసుకువెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిందితుడిపై నేరం రుజుబు కావడంతో ఏడాది జైలు శిక్ష 95.10 లక్షలు జరిమానా వేశారు జరిమానాలో 95 లక్షలని ఫిర్యాదుకి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version