హిమాన్షును రాజకీయాల్లోకి లాగొద్దు : తీన్మార్ మల్లన్న కు బండ్ల గణేష్ వార్మింగ్!

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు పై తీన్మార్ మల్లన్న నిర్వహించిన పోల్ సంచలనంగా మారింది. తీన్మార్ మల్లన్న కు చెందిన క్యూ న్యూస్ ఛానల్ సోషల్ మీడియా లో నిర్వహించిన ఫోల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరిగింది అని ఆ పోల్ లో నెటిజన్లను ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. భద్రాచలం గుడి లో నా?… హిమాన్షు శరీరంలోనా ? అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమారుడి రూపాన్ని విమర్శించడం పట్ల ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణ లో బీజేపీ నేతలకు మీరు నేర్పిస్తుంది ఇదేనా అంటూ జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవే మాటలు మోడీ కుటుంబాన్ని, అమిత్ షా కుటుంబాన్ని మేము విమర్శించ లేమా? అని ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తన స్థాయిలో స్పందించారు. చిన్నపిల్లలను, మహిళలను అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ బండ్ల గణేష్… ట్వీట్ చేశారు. తీన్మార్ మల్లన్న ట్వీట్ చేస్తూ ట్వీట్ చేయడం.. గమనార్హం. అంటే.. బండ్ల గణేష్ తీన్మార్ మల్లన్న కు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version