ఐపీఎల్ 28వ మ్యాచ్‌.. కోల్‌క‌తా టార్గెట్ 195..

-

షార్జాలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 28వ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు భారీ స్కోరు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. దీంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 194 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి జ‌ట్టుకు భారీ స్కోరును అందించారు. బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో డివిలియ‌ర్స్‌, ఫించ్‌, కోహ్‌లి, ప‌డిక్క‌ల్‌లు అద్భుతంగా రాణించారు.

33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో డివిలియ‌ర్స్ 73 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌ను ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో డివిలియ‌ర్స్ ప‌రుగులు పెట్టించాడు. అలాగే కెప్టెన్ కోహ్లి కూడా డివిలియ‌ర్స్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి స్కోరు బోర్డును ప‌రుగెత్తించాడు. 28 బంతుల్లో 1 ఫోర్‌తో కోహ్లి 33 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్ ఫించ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 47 ప‌రుగులు చేయ‌గా, మ‌రొక ఓపెన‌ర్ ప‌డిక్క‌ల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 32 ప‌రుగులు చేశాడు. కాగా కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ప్ర‌సిధ్ కృష్ణ‌, ఆండ్రూ ర‌స్సెల్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version