ఓటీటీలోకి వచ్చేసిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ

-

పలు చిత్రాల్లో హీరోయిన్‌గా గ్లామర్ రోల్స్‌తో మెప్పించిన అదా శర్మ తాజాగా కీలక పాత్ర పోషించిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ప్లాట్ఫామ్ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీలో ప్రసారమవుతోంది. ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. విపుల్ అమృతలాల్ షా నిర్మాతగా వ్యవహరించారు.

కాగా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నక్సలిజం చుట్టూ తిరిగే వాస్తవికతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.దట్టమైన అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ సృష్టిస్తున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారిగా అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది.బస్తర్ జిల్లాలో ఇండియన్ ఆర్మీకి,నక్సల్స్ కి మధ్య పరస్పరం కాల్పులు జరుగడం..రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వంటి సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news