విజయ్ సాయి రెడ్డి vs కన్నా లక్ష్మీ నారాయణ వెనక కథ ఇదా..?

-

విజయసాయిరెడ్డి వర్సెస్ కన్నా లక్ష్మినారాయణ గొడవ పట్ల రకరకాల వార్తలు వినబడుతున్నాయి. మొదటి నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ వైసిపి పార్టీ పట్ల చాలా సానుకూలంగానే ఉంటున్నారు. అంతేకాకుండా రాజ్యసభ వంటివాటిలో బలం అవసరం కావటంతో జగన్ కి కేంద్రం లో కొన్ని పదవుల ఆఫర్లు కూడా అప్పట్లో ఇవ్వటం జరిగింది. జగన్ తీసుకోకపోయినా గాని కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కి ఇండైరెక్టుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా వైసీపీ బీజేపీ పార్టీల మధ్య మంచి వాతావరణం ఉన్న టైంలో కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా వైసీపీ పార్టీ అవినీతి చేసింది అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు హస్తం ఉందని అనుమానిస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా పెద్ద కథ నడిపిస్తున్నారని వైసిపి పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి- బిజెపి -జనసేన మైత్రి బంధం మళ్లీ క్రియేట్ చేయాలని, 2014 ఎన్నికల మాదిరిగా కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగం లో కన్నా నీ వెనక నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీపై ఎగదోసే కార్యక్రమం చేసినట్లు వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇందువల్లే విజయసాయిరెడ్డి నేరుగా బీ.జె.పీ ని టార్గెట్ చేయకుండా వైసీపీ వర్సెస్ కన్నా లక్ష్మినారాయణ అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగిందట. కాగా కన్నా లక్ష్మీనారాయణ పై వ్యాఖ్యలు చేయకముందే ఢిల్లీ బిజెపి పార్టీ పెద్దల దగ్గర ఈ విషయం గురించి చర్చించిన తర్వాత విజయసాయిరెడ్డి విమర్శలు చేసినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version