Breaking: ఉత్తమ జాతీయ చిత్రంగా ‘ఉప్పెన’

-

69వ జాతీయ పురస్కారాలను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఈ సినిమా అవార్డు ఈవెంట్
జరుగుతుంది. ఇక ఇందులో ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమ చార్యులు ఎన్నికయ్యారు. ఇక తాజాగా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఎన్నిక అయ్యింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2021.. ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యింది.ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది.

నిజమైన ప్రేమకు.. కులాలు మతాలు అడ్డుకాదని నిరూపించిన సినిమా ఉప్పెన. ఇక ఈ సినిమా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపిక అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమానే నేషనల్ అవార్డు కు ఎన్నిక అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version