గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళకి కూడా పట్టాలిస్తాం: భట్టి

-

గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్ళకి కూడా త్వరలో పట్టాలిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈరోజు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని అన్నారు. సొంతింటి కల సహకారం కోసం 17వ రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని అన్నారు.

ఇచ్చిన హామీలన్నీ 90 రోజుల్లోకి అమలు చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారెంటీలని ప్రకటించామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయింది అన్నారు భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు భద్రాచలం అభివృద్ధికి తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news