తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కరోనా

-

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోన బారిన పడగా ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోన బారిన పడ్డారు. ఆయనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయన ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈయన పది రోజుల క్రితం కరోనాతో మరణించిన మృతదేహాల అంత్యక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. కరోనాతో మరణించిన రోగుల అంత్యక్రియలపై తొలగించేందుకు కరుణాకర్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియల విషయంలో రాష్ట్రంలోని పలు చోట్ల ప్రజలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో దీంతో ప్రజల్లో నెలకొన్న అపోహాలను తాను స్వయంగా అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version