మణికొండ మున్సిపాలిటీకి ఝలక్… కౌన్సిలర్‌ తో అధికారుల పై వేటు

-

రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ కి ఝలక్ ఇచ్చింది జిల్లా యంత్రాంగం. మునిసిపల్ 7వ వార్డు కౌన్సిలర్‌ బి. పద్మారావును ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. నెక్నాంపూర్ లో ఓ పూరాతన దేవాలయాన్ని కూల్చివేత విషయంలో సస్పెన్షన్ వేటు వేశారు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.

మున్సిపాలిటీ లో ఉన్నటు వంటి ఏఈ విఠోబా పై కూడా వేటు చేశారు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితంగా పూర్తి చేయకపోవడం, పనుల్లో నాణ్యత పరిణామాలు పాటించక పోవడం పై వేటు వేటు వేశారు. అంతే కాదు కమిషనర్ జయంత్ కుమార్ మరియు ఏఈ విఠోబా ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. కాగా రెండు రోజుల నుంచి మణికొండ మున్సిపాలిటీ వ్యవహారం పై మీడియా లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news