వైయస్ షర్మిలకు మరో షాక్.. నిరుద్యోగుల నుంచి నిరసన సెగ !

-

నిరుద్యోగుల సమస్యలపై వైఎస్ షర్మిల.. ప్రతి మంగళవారం నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే నిరుద్యోగి ఆత్మహత్య పై రేపు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం లింగపూర్ లో నిరసన దీక్షకు పిలుపి నిచ్చారు వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అయితే  రేపటి షర్మిల నిరసన దీక్షకు సహకరించబోమని భుక్యా శంకర్ నాయక్ అన్నారు.

షర్మిల తమ ఇంటికి రావద్దంటూ ఆత్మహత్య చేసుకున్న భుక్యా నరేష్ తండ్రి భూక్యా శంకర్ నాయక్ హెచ్చరించారు. తమ కొడుకు నరేష్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమేనని చెప్పిన శంకర్ నాయక్.. తమ కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నామని తెలిపారు. తమ కొడుకు చావును రాజకీయం చేయవద్దంటూ షర్మిల కు విజ్ణప్తి చేస్తూ.. ఈ మేరకు వీడియో విడుదల చేసాడు మృతుడు భుక్యా నరేష్ తండ్రి శంకర్ నాయక్. దీంతో రేపు నిర్వహించ బోయే షర్మిల నిరసన దీక్ష కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version