బ్రేకింగ్ : ఈటెల రాజేందర్ కు కీలక పదవి !

-

బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్‌కి ప్రత్యేక ఆహ్వానితులు మరియు శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో)లతో జాబితాను ప్రకటించింది కేంద్ర బీజేపీ. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటి లో ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ మరియు డాక్టర్ మురళి మనోహర్ జోషి, మాజీ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా మరియు నితిన్ గడ్కరీ, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరియు నేషనల్ ఆఫీస్ బేరర్స్ తో సహా 80 మంది సభ్యులు ఉన్నారు.

etala

అలాగే.. జాతీయ కార్యనిర్వాహక కమిటీ లో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు మరియు 179 శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో) ఇందులో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, అసెంబ్లీ మరియు కౌన్సిల్స్‌లో శాసనసభా పక్ష నాయకులు , మాజీ ముఖ్యమంత్రులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రభారిస్/సాహ్-ప్రభారిస్, స్టేట్అధ్యక్షులు,రాష్ట్ర జనరల్ సెక్రటరీ లు సభ్యులు గా ఉన్నారు.

ముఖ్యంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి జి. కిషన్ రెడ్డి, మాజీ ఎంపిలు జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కింది. అలాగే.. జాతీయ ఆఫీస్ బేరర్లులలో తెలంగాణ నుండి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ కు చోటు దక్కగా… జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఆంధ్రప్రదేశ్ నుండి పురుందేశ్వరి కి చోటు దక్కింది. జాతీయ కార్యదర్శి గా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్ కు చోటు దక్కగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుండి విజయశాంతి, ఈటెల రాజేందర్ లకు చోటు దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version