జగన్ కోసమే మోడీని కొడాలి నానీ తిట్టారా…?

-

బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మంత్రి కొడాలి నానీపై విమర్శలు చేసారు. కొడాలి నాని జగన్ మత్తులో వున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మెప్పుపొందేందుకు కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాధ్ లపై అనుచితంగా మాట్లాడ్డం దారుణం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత ప్రభుత్వం వహించాలని అన్నారు.

కొడాలి నాని వేరొక మతం పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే జగన్ ఊరుకునేవారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కొడాలి నాని పై చర్యలు తీసుకోకపోతే బిజేపి ఉద్యమిస్తుంది అని ఆయన హెచ్చరించారు. మోడీ వ్యక్తిగత జీవితం పై మాట్లాడే అర్హత కొడాలికి లేదని స్పష్టం చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటోంటే జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version