పాలమూరులో కమలం జోరు…ఆ మంత్రికి కష్టమే!

-

అధికార టీఆర్ఎస్ ఎంత హడావిడి చేసిన…అసలు బీజేపీకి అభ్యర్ధులే లేరని మాట్లాడినా…డిపాజిట్లు రావని విమర్శలు చేసినా సరే…తెలంగాణలో మాత్రం బీజేపీ వేగంగా బలపడుతుంది…ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఒక్క ఏడాది సమయంలోనే ఊహించని విధంగా బీజేపీ బలపడుతూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడమే బీజేపీకి బలం అని చెప్పొచ్చు. అలాగే బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ…ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నారు. ప్రజలకు తాము ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. అందుకే బీజేపీకి ప్రజా మద్ధతు పెరుగుతుంది.

ఇటీవల వచ్చిన సర్వేలు బీజేపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ. అలాగే ప్రతి జిల్లాల్లోనూ బీజేపీ వేగంగా పుంజుకుంటుంది…ఇదే క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ గట్టిగానే పికప్ అయిందని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ లు పోటాపోటిగా ఉండేవి. తర్వాత జిల్లా..టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారింది. గత ఎన్నికల్లో అక్కడ కారు సత్తా చాటింది. కానీ నిదానంగా అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది.

ఇదే క్రమంలో అక్కడ కాంగ్రెస్, బీజేపీలు బలపడుతూ వస్తున్నాయి. అయితే జిల్లాలో కాంగ్రెస్ కు మొదట నుంచి బలం ఉంది…కానీ అనూహ్యంగా జిల్లాలో కమలం జోరు పెరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా జిల్లాలో బీజేపీకి ఓటింగ్ ఎక్కువ వస్తుందని తేలింది. అలాగే జిల్లాలో ఉన్న కల్వకుర్తి, మహబూబ్ నగర్, గద్వాల్, షాద్ నగర్, ఆలంపూర్ లాంటి నియోజకవర్గాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ స్థానంపై బీజేపీ పట్టు సాధిస్తుంది.

గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ తరుపున శ్రీనివాస్ గౌడ్ గెలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ బీజేపీ పుంజుకుంది..2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గెలిచింది…ఇక్కడ బీజేపీకి బలం ఎక్కువే. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కు బీజేపీనే చెక్ పెట్టేలా ఉంది. మొత్తానికి పాలమూరులో కమలం జోరు కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version