హిందూ దేవుళ్లపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బిహార్ లోని పిర్‌పైంతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన లాలన్.. హిందువుల విశ్వాసాలను తప్పుబట్టారు. అంతటితో ఆగకుండా తన వాదనలు తప్పు అనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లాలన్‌ వ్యాఖ్యలు ఖండిస్తూ స్థానికులు భగల్‌పూర్‌లో నిరసన చేపట్టారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..?

“దీపావళి వేళ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు. లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే డబ్బు వస్తుందని అనుకుంటే.. ముస్లింలలో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉండేవారు కాదు. సరస్వతీ దేవిని కూడా ముస్లింలు పూజించరు, మరి వారిలో పండితులు లేరా. వాళ్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు లేరా. ఆత్మ, పరమాత్మ అనేది కేవలం ప్రజల నమ్మకం మాత్రమే. మీరు నమ్మితే అదే దేవుడు, లేదంటే అదో రాయి. దేవుళ్లు, దేవతల్ని నమ్మడం మనపై ఆధారపడి ఉంది. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి, నిర్ణయానికి రావాలి. మీరు దేవుల్ని నమ్మడం ఆపేస్తే, అప్పుడు మీలో మేధస్సు పెరుగుతుంది” అని ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version