విశాఖ ప్రజలకు త్వరలోనే శుభవార్త చెబుతాం.. స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎంపీ సంచలనం

-

విశాఖ పట్నం లో నిన్న పర్యటించిన బిజేపి ఎంపి సుజనాచౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మెడలు వంచి ఎవరూ పనిచేయించలేరని….ఒక పద్ధతి ప్రకారం వస్తే అన్నీ జరుగుతాయని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానిది విధానపరమైన నిర్ణయమని చెప్పారు.త్వరలోనే విశాఖ ప్రజలకు తీపికబురు చెబుతామని… రాష్ట్రంలో విధానం.. దండు కొండి పంచుకొండి అనే విధానం ఉందని మండిపడ్డారు.

వచ్చే సారికి ఈ ప్రభుత్వం ఉండదని.. అధికారులు, వ్యాపారులపై కేంద్రం కన్ను ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు….నా వ్యాఖ్యలను సూచన గా స్వీకరించానని పేర్కొన్నారు. హెచ్చరికగా భావించినా అది తీసుకునే వాళ్ళ ఇష్టమని.. రాష్ట్ర ప్రభుత్వంను పద్ధతి ప్రకారం అడిగితే స్టీల్ ప్లాంట్ విషయం గురించి చర్చిస్తుందని వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ మా భాగస్వామి…స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఆకాంక్షలను కేంద్రానికి తప్పకుండా తీసుకుని వెళతామని స్పష్టం చేశారు బిజేపి ఎంపి సుజనాచౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news