కంగనాకి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ ఎంపి

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనాకు జారీ అయిన సమన్ల విషయం లో న్యాయ పరంగా ఆమెకు సహాయం చేయడానికి సిద్ధమని చెప్పాడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఆయన ఇప్పటికే ఈ అంశంపై కంగనాకు చెందిన ఆఫీసు ప్రతినిధులు న్యాయవాది ఇష్కరన్ సింగ్ భండారీతో మాట్లాడినట్టు చెప్పారు. త్వరలోనే కంగనాకు న్యాయ పరమైన సహాయం చేస్తానని అతను చెప్పారు.

kangana ranaut

అంతే కాకుండా బాలీవుడ్ లో స్టార్ డం ప్రకారం తెలంగాణ టాప్ నటీమణుల్లో ఒకరని చెప్పారు. కానీ ఆమె ధైర్యం కూడా మరింత ఎక్కువ అని చెప్పారు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో సమన్లు ఎందుకు జారీ చేశారో తనకు తెలియడం లేదని చెప్పారు. గతంలో ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రాణం తీసుకోవడానికి కారణం కొందరు ఉన్నారు అని ఆరోపించింది. ఒకవేళ కనుక ఆమె ఈ విషయం నిరూపించకపోతే పద్మశ్రీని తిరిగి వెనక్కి ఇస్తానని ఆమె చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version