BJP: VVS లక్ష్మణ్‌ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ?

-

BJP: VVS లక్ష్మణ్‌ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. ఎంపి టికెట్ కోసం గంటా చక్రపాణి, vvs లక్ష్మన్ లను సంప్రదించింది బీజేపీ. అయితే… పోటీ చేసేందుకు విముఖత చూపించారట గంటా చక్రపాణి. పెద్దపల్లి టికెట్ ఇస్తామని చెప్పినా కూడా గంటా చక్రపాణీ రిజెక్ట్‌ చేశారు. VVS లక్ష్మణ్‌ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది.

V. V. S. Laxman. (File Photo: IANS)

కాగా… తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయింది. మార్చి నెల 4 వ తేదిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల అయింది. మార్చి 4వ తేదీన ఉదయం 09.20 గంటలకు నాగ్ పూర్ ఏయిర్ పోర్టు కు చేరుకోనున్న ప్రధాని మోడీ….10.20 కి ఆదిలాబాద్ హెలి ప్యాడ్ కు చేరుకుంటారు.ఇక 10.30 నుంచి 11 గంటల వరకు వివిధ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. అనంతరం 11.10 నిమిషాలకు ఆదిలాబాద్‌ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు ప్రధాని మోడీ.

 

Read more RELATED
Recommended to you

Latest news