బీజేపీ మాస్టర్ ప్లాన్.. ముద్రగడను పట్టేసినట్టేనా ?

-

ఏపీలో‌ బలోపేతం కావడం కోసం బిజెపి ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసిందని అంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు బిజెపిలోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇటీవలే నటి వాణీవిశ్వానాధ్ ను కలిసి చర్చించిన సోము‌ వీర్రాజు, కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి  ముద్రగడ పద్మనాభం ను కలవనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కిర్లంపూడిలో రేపు ముద్రగడతో సోము వీర్రాజు భేటీ కానున్నట్టు సమాచారం.

అనంతరం మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు అలానే పడాల అరుణను కూడా వారి వారి నివాసాల్లో కలిసే అవకాశం ఉందని అంటున్నారు.  ఇప్పటికే జనసేన మద్దతు సంపాదించిన బీజేపీ ఇప్పుడు కాపు వోట్ బ్యాంక్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా అయినా ముద్రగడను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి రేపటి భేటీ ఎన్ని కొత్త రాజకీయ సమీకరణాలకు కారణం అవుతుందో ? 

Read more RELATED
Recommended to you

Exit mobile version