సుజనాకు షాక్ ఇచ్చిన బిజెపి…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచాలి అంటూ ఇప్పుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ఈ తరుణంలో ఆయనకు షాక్ ఇస్తూ… రాష్ట్ర బిజెపి ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ సుజనా చౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధమని రాష్ట్ర పార్టీ తన ట్వీట్ లో స్పష్టం చేసింది.

రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు స్పష్టం చేశారని తన ట్వీట్ లో ప్రస్తావించింది. నిన్న సాయంత్రం తన నివాసం లో మీడియాతో మాట్లాడిన సుజనా… కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అని వ్యాఖ్యలు చేసారు. దీనిపై రాష్ట్ర బిజెపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version