కొత్త‌గూడెంలో క‌ల‌క‌లం…భార్య‌ను ర‌ప్పించేందుకు భ‌ర్త క్షుద్ర‌పూజ‌లు..!

-

కొత్త‌గూడెంలో క్షుద్ర‌పూజ‌ల క‌ల‌క‌లం రేగింది. భ‌ద్రాద్రికొత్త‌గూడెం శేఖరంబంజరకు చెందిన కారు డ్రైవర్‌కు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన యువతిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్ద‌రికీ నాలుగెళ్లు గ‌డిచినా పిల్ల‌లు పుట్టక‌పోవ‌డం దానికి తోడుకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో మ‌న‌స్ప‌ర్ధ‌లు ఏర్ప‌డ్డాయి. దాంతో వేరే ఊర్లోకి వెళ్లి కాపురం పెట్టారు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్పర్థ‌లు కాస్తా ఎక్కువ‌య్యి గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఆ త‌రవాత వేరే ప్రాంతానికి భ‌ర్త ప‌నికోసం వెళ్లాడు.

దాంతో భార్య ఇల్లు విడిచి బంధువుల ఇంటికి వెళ్లింది. భ‌ర్త తిరిగి ఇంటికి వ‌చ్చాక ఫోన్ చేసినా తిరిగి రాలేదు. అయితే ఓ స్నేహితుడు క్షుద్ర‌పూజ‌లు చేస్తే భార్య తిరిగి వ‌స్తుంద‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో ఓ భూత‌వైద్యుడిని సంప్ర‌దించారు. అత‌డికి రూ.30 వేలు ఇచ్చి పూజ‌లు జ‌రిపించాడు. ఆ త‌ర‌వాత నాలుగు రోజుల‌కు భార్య నుండి ఫోన్ వ‌చ్చింది. ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చింది. కానీ భార్య పై క్షుద్రపూజ‌లు చేయించిన విష‌యం ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెలిసింది. దాంతో వారు భ‌ర్త‌ను చిత‌క‌బాధారు. ఇక ఈ విష‌యం కాస్తా పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెల్ల‌డంతో వారు కౌన్సింలింగ్ ఇచ్చి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news