బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం..పోలీసుల అదుపులో స్టార్ హీరోల పిల్లలు..?

-

బాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో పార్టీ జరగగా అందులో డ్రగ్స్ వినియోగించారు అని తేలింది. ఈ వ్యవహారం బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీలో స్టార్ హీరోల పిల్లలు ఉన్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ పార్టీలో కొంత మందిని అరెస్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ వారిలో సెలబ్రెటీల పిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా ఇప్పుడే సమాధానం చెప్పలేమని పేర్కొన్నారు. ఇక ఈ పార్టీలో అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా పలువురి పేర్లు వినపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news