ఫోన్ దొంగలించాడని బట్టలు విప్పి చెట్టుకు కట్టి చీమలతో కుట్టించారు..!

-

బీహార్‌లోని ఈసాపూర్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్నది. ఓ బాలుడిని చిత్రహింసలకు గురి చేశారు గ్రామస్తులు. ఫోన్ దొంగలించాడన్న ఆరోపణతో పదేళ్ల బాలుడిని చిత్ర హింసలు పెట్టారు. బాలుడి డ్రెస్ విప్పేసి చెట్టు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆ బాలుడి శరీరంపై చక్కెర పోసి చీమలను తీసుకొచ్చి ఆ చక్కెర మీద పోసి వాటితో కుట్టించారు. ఈ తతంగాన్నంతా మిగితా వారు చూస్తూ ఎంజాయ్ చేశారు. సినిమా చూసినట్టు చూశారు. ఈ విషయం తెలుసుకొని చుట్టు పక్కన గ్రామాల నుంచి కూడా వచ్చి ఆ దృశ్యాన్ని అంతా తిలకించారు.. కానీ ఒక్కరు ఆ బాలుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆ బాలుడి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఘటన గురించి పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి కట్లు విప్పి స్టేషన్‌కు తరలించారు. బాలుడి గురించి ఆరా తీయగా.. నిజంగానే ఆ బాలుడు దొంగ అని.. ఇదివరకు కూడా చాలా దొంగతనాలు చేశాడని.. ఇప్పుడు కూడా జువైనల్ హోం నుంచి తప్పించుకొని మరో దొంగతనం చేయబోయి గ్రామస్తులకు దొరికాడని పోలీసులు తెలిపారు. అయితే.. బాలుడిని చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదని.. బాలుడిని హింసించిన వాళ్లందరిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news