BREAKING: బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

-

బిగ్ బాస్ షోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలువగ అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ విజేతగా నిలిచిన ప్రశాంత్ ని అభినందించడానికి ఆదివారం నాడు అధిక సంఖ్యలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియో కి వచ్చారు. అదే సమయంలో అమర్ దీప్ ని అభినందించడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. ఈ సమయంలో అమర్దీప్ మరియు ప్రశాంత్ అభిమానుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ప్రశాంత్ యొక్క అభిమానులు బీభత్సం సృష్టించడంతోపాటు పలు వాహనాలను ధ్వంసం చేసి ఆ వాహనాల యొక్క అద్దాలను పగలగొట్టారు. అయితే ఈ అల్లర్లపై పోలీసులు పల్లవి ప్రశాంత్ పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

 

ఇదిలా ఉండగా… ఈరోజు ప్రశాంత్ వాళ్ళ సొంత ఊరు అయినా గజ్వేల్ మండలంలోని కొల్లూరు గ్రామంలో తన ఇంటి వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడు మహవీర్ ని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిద్దరితో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు అయినది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news