బ్రేకింగ్: తెలంగాణాలో ఒక్క రోజే 2 వేల కేసులు…!

-

తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు అదుపులో ఉంది అని భావించిన కరోనా ఇప్పుడు తన ప్రతాపం చూపిస్తుంది. తెలంగాణాలో గత 24 గంటల్లో 1986 మంది కరోనా బారిన పడగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కేసులు 16 వేల 703 కి చేరుకున్నాయి. మరణాలు 519 కి చేరుకున్నాయి. మొత్తం యాక్టివ్ కేసులు 16 వేల 796 గా ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

coronavirus

 

తెలంగాణాలో రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది. ఇప్పటికే 70 శాతం పైగా ఉంది అని కేంద్రం స్వయంగా వెల్లడించింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని పేర్కొంది. మరణాలు రేటు కూడా తెలంగాణాలో చాలా వరకు అదుపులోనే ఉంది హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో కూడా పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version