BREAKING : చంద్రబాబుకు అస్వస్థత, పరీక్షిస్తున్న డాక్టర్స్ !

-

దాదాపుగా నెల రోజుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చంద్రబాబు తరపున వాదిస్తున్న న్యాయవాదులు కేసులో ఎటువంటి అభివృద్ధిని చేయలేకపోయారు. క్వాష్ పిటిషన్ ఇంకా సుప్రీమ్ కోర్ట్ లో విచారణలో ఉంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబును జైలు అధికారులు హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ఈ వాతావరణానికి తట్టుకోలేక అధిక ఎండా వేడిమి మరియు ఉక్కపోత కారణంగా అలర్జీ వచ్చిందట. ఈ విషయాన్ని చంద్రబాబు అధికారులకు తెలియచేయగా వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రి లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినా వైద్యులకు సమాచారం ఇవ్వగా, వెంటనే వారి జైలుకు వచ్చి పరీక్షిస్తున్నారు.

చిన్నపాటి సమస్యే అని తెలుస్తోంది.. కానీ ఇంకా ఎటువంటి సమాచారం వైద్యుల నుండి రాలేదు. జైలులో నెల రోజులకు పైగానే ఉండడంతో ఈ విధంగా జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version