బ్రేకింగ్: తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…!

-

తెలంగాణాలో గత 24 గంటల్లో 983 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా బారిన్ పడి 11 మంది ప్రాణాలు కోల్పోయారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణాలో ఇప్పటి వరకు 551 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో 273 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులు 67 వేల 660 గా ఉన్నాయి.

coronavirus

48 వేల మంది కరోనా నుంచి కోలుకోగా యాక్టివ్ కేసులు 18 వేల 500 ఉన్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 4 లక్షల 87 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. గత 24 గంటల్లో 9 వేల మందికి పైగా కరోనా పరిక్షలు చేసారు. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో దాదాపుగా కరోనా అదుపులోకి వచ్చింది. వరుసగా నాలుగు రోజులు దాదాపు 2 వేల కేసులు నమోదు అయ్యాయి. నేడు భారీగా తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version