బ్రేకింగ్: ప్లాస్మా దానం చేసిన సంగీత దర్శకుడు కీరవాణి

-

కరోనా వైరస్ చికిత్సకు ఇప్పుడు ప్లాస్మా దానం అనేది చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా దానం చేయడం అనేది చాలా కీలకంగా మారిన నేపధ్యంలో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానంలో తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు ఎంఎం కీరవాణి ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు.Despite Lockdown - MM Keeravani Is Working On The Music Of RRR

నా కొడుకు భైరవతో పాటు కిమ్స్ వద్ద ప్లాస్మాను స్వచ్ఛందంగా విరాళంగా ఇవ్వడం జరిగిందని ఆయన ట్వీట్ చేసారు. నేను చాలా హ్యాపీ గా ఉన్నా అని ఆయన పేర్కొన్నారు. ఇది సాధారణ రక్తదాన సెషన్‌ లో మాదిరిగా చాలా సాధారణమైనదిగా భావిస్తున్నారు. ప్లాస్మా దానంలో పాల్గొనడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక ఫోటో కూడా ఆయన షేర్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news