బ్రేకింగ్: విషమంగా తెరాస అగ్ర నేత ఆరోగ్యం

-

తెలంగాణాలో అధికార పార్టీ నేతలను కరోనా వైరస్ వేధిస్తుంది. వారికి చుక్కలు చూపిస్తుంది. కరోనా బారిన పడి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కరోనా బారిన పడిన మాజీ హోం మంత్రి తెరాస అగ్ర నేత నాయిని నరసింహా రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన హైదరాబాద్ లో అపోలో లో వెంటిలేటర్ మీద నాయిని కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఆయనతో పాటుగా భార్య, అల్లుడు కు కూడా కరోనా సోకింది. ఇటీవల ఆయనకు కరోనా కాస్త అదుపులోకి వచ్చింది. అయినా సరే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో మళ్లీ హాస్పిటల్ లో చేరారు. ఊపిరి తీసుకోవడం కష్టం గా ఉండటంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version