బ్రేకింగ్: హీరోయిన్ పై కక్ష సాధిస్తున్న ప్రభుత్వం

-

ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు కూల్చి వేస్తున్నారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ప్రస్తుతం కంగనా రనౌత్ ఆఫీస్ ని కూల్చి వేస్తుంది. ఈ మేరకు జేసీబీలు సహా మున్సిపల్ సిబ్బందితో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై కంగనా న్యాయవాది బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, త్వరలో విచారణ జరుగుతుంది.

తన కార్యాలయ ప్రాంగణాన్ని బిఎంసి కూల్చివేసినందుకు గానూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది మధ్యాహ్నం 12.40 గంటలకు జస్టిస్ ఎస్ కథావాలా ముందు విచారణ జరిగే అవకాశం ఉంది.ఇక కాసేపటి క్రితం కంగనా ముంబై చేరుంది. ఆమెతో పాటుగా కర్నిసేన కూడా వస్తుంది. కాగా ఇటీవల ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో కంగనా పోల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శివసేన వర్సెస్ కంగనాగా పరిస్థితి మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version