ఏపీలో షర్మిల పార్టీ.. బద్రర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు

-

వైఎస్‌ షర్మిల… రాజన్న రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో… తెలంగాణలో కొత్త పార్టీ పెట్టింది. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి… వైఎస్‌ షర్మిల… చాలా దూకుడుగా కేసీఆర్‌ సర్కార్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో… ఏపీలో కూడా జగన్‌ కు వ్యతిరేకంగా… వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టబోతున్నారని… వార్తలు వచ్చాయి. అయితే..ఈ వార్తలను వైఎస్‌ షర్మిల కూడా ఖండించకుండా.. రాజకీయా పార్టీని ఎక్కడైనా పెట్టుకోవచ్చనే ధోరణితో మాట్లాడారు.

ఇలాంటి తరుణంలో… ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తుందని వస్తున్న వార్తలపై భర్త బ్రదర్‌ అనిల్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన విజయవాడకు వెళ్లారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు వద్ద మీడియా ఆయనను ఏపీలో షర్మిల పార్టీ పై ప్రశ్నించగా…. షర్మిల పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని బదులు ఇచ్చారు. పార్టీ ఏర్పాటు గురించి తాను మాట్లాడనని తెలిపారు. విజయవాడలో తన సొంత పని పైనే ఏపీకి వచ్చానని క్లారిటీ ఇచ్చారు బ్రదర్‌ అనిల్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version