నటి శోభనకు ఓమిక్రాన్ పాజిటివ్… ఇప్పటికే కరోనా బారిన పడ్డ పలువురు సినీ ప్రముఖులు

-

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రముఖ నటి, క్లాసికల్ డ్యాన్సర్ శోభన కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శోభన తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ప్రకటించింది. ప్రపంచం అద్బుతంగా నిద్రపోతున్న వేళ.. నాకు ఓమిక్రాన్ సోకిందని, కీళ్ల నొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయని..అయితే ప్రస్తుతం రోజురోజుకు లక్షణాల తీవ్రత తగ్గిందని, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని.. ఇది నా వ్యాధిని 80 శాతం నిరోధించిందంటూ.. తన పేజీలో వ్యాఖ్యానించింది శోభన.

తెలుగుతో పాటు తమిళం, మళయాళ రంగాల్లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది శోభన. చిరంజీవి, మోహన్ లాల్, రజినీ కాంత్ వంటి అగ్ర కథానాయకులతో నటించింది.

ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, త్రిష, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, సత్యరాజ్, మ్యూజిక్ డైెరెక్టర్ థమన్, ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ మొదలైన వారు కరోనా బారిన పడ్డరాు.

Read more RELATED
Recommended to you

Exit mobile version