కాంగ్రెస్ లోకి BRS ఎమ్మెల్యే రాజయ్య … సీనియర్ నేతతో భేటీ ?

-

ఇటీవల తెలంగాణ ఎన్నికల కోసం BRS పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో స్టేష ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు అవకాశం దక్కని విషయం తెలిసిందే. రాజయ్యకు తన నియోజకవర్గం లోని జానకీపురం పంచాయితీ సర్పంచ్ నవ్యతో వివాదాలు జరిగిన విషయం బాగా హైలైట్ కావడంతో ఈయనపై వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. అందుకే కేసీఆర్ సైతం ఈయనకు టికెట్ అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. అందుకే రాజయ్య తన ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది, ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజా నర్సింహా తో రాజయ్య భేటీ అయ్యాడట. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం హనుమకొండ లోని నయీమ్ నగర్ లో వీరు కలుసుకున్నారట.

మరి రాజయ్య కాంగ్రెస్ లోకి రావడం పైన వీరిద్దరి మధ్యన చర్చ జరిగి ఉంటుందన్నది రాజకీయ వర్గాల అనుమానం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news