సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ, ఏబీఎన్ రాధకృష్ణలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు ఈ క్రమంలో నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అలాగే బీఆర్ఎస్ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.MCC అమలులో ఉన్నప్పుడు, 06.04.2024న, శ్రీ. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, అత్యంత దుర్భాషలాడారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ, ఏబీఎన్ రాధకృష్ణలపై ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరియు పబ్లిషర్, ఎడిటర్‌పై కేంద్ర ఎన్నికల కమీషన్‌కి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తూ లేఖను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news