IPL 2024 : రాణించిన రాజస్థాన్ బ్యాట్స్మెన్… గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక మొదటగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్లు తొలి వికెట్ కు 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత కాసేపటికి ఎనిమిది పరుగులకి ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు సాంసన్, రియాన్ పరాగ్ మూడో వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.కెప్టెన్ సంజు సాంసన్ 67 రన్స్ చేయగా, రియాన్ పరాగ్ 76 పరుగులతో రాణించాడు.చివర్లో హెట్మయిర్ రాణించడంతో (5 బంతుల్లో 15) రాజస్థాన్ 196 పరుగుల స్కోర్ సాధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news