విద్యా రంగంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు సోమవారం అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ.. వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం వెంటనే విడుదల చేయాలన్నారు. గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.