దారుణం: భూత వైద్యం పేరుతో కొట్టి చంపేసాడు…!

-

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో దయ్యం ఉందని భూత వైద్యం పేరుతో చేసిన దాడిలో రజిత అనే దళిత వివాహిత కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. గత వారం రోజుల క్రితం వివాహిత రజితను అత్తారింటి వద్ద విచక్షణా రహితంగా భూత వైద్యుడు శ్రీనివాస్ దాడి చేసాడు. ఆమె ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది.

ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి… ఇప్పటికే భూత వైద్యుడు శ్రీనివాస్ తో పాటు సహకరించిన రజిత బాబాయి శ్యామ్ ను కూడా అరెస్టు చేసారు. రజిత స్వగ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామం కాగా గత రెండేళ్ళ క్రితం మల్లేష్ అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది. మృతి చెందిన రజిత కు రెండు నెలల పాప కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version