కర్నూల్ లో దారుణం..అక్కను వదిలేశాడని బావను వేటకొడవళ్లతో చంపిన బామ్మర్దులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమ అక్క కోసం.. ఏకంగా.. సొంత బావనే… దారుణంగా హత్య చేశారు బామ్మర్ధులు. ఈ విషాదం సంఘటన కర్నూల్‌ జిల్లా ఆస్పరి మండలం వెంగలయ దొడ్డి లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెలితే… సుంకన్న, అలాగే అతని భార్య గత కొన్ని రోజుల నుంచి ఆస్పరి మండలం వెంగలయ దొడ్డి లో నివాసం ఉంటున్నారు. అయితే.. ఇటీవల తన భార్య తో గొడవ పడి… ఆమెను పుట్టింటికి పంపించాడు సుంకయ్య.

murder
murder

దీంతో పుట్టింటికి వెళ్లిన అతని భార్య… అసలు విషయాన్ని తన సోదురులతో చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన… సుంకయ్య బామ్మర్ధులు… మొదట చాలా సున్నితంగా తమ అక్కను తీసుకు పోవాలని కోరారు. అయితే… దానికి సుంకయ్య ఒప్పు కోలేదు. దీంతో వేట కోడవళ్లతో బావ సుంకయ్యను దారుణంగా హత్య చేశారు బామ్మర్దులు. ఊరి చివరకు తీసుకుని వెళ్లి మరీ…. బావ సుంకయ్య పై దాడి చేసి చంపేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీ లో ఉన్నారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news