నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలి – బుద్దా వెంకన్న

-

నారా లోకేష్ కి కేంద్రం జెడ్ కేటగిరీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. బాబాయ్ వివేకా హత్య కేసులో సాక్షి అయిన గంగాధర్ రెడ్డి మరణం పై సీబీఐ విచారణ జరపాలని.. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీనుతో పాటు నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారో అలానే జరుగుతోందన్నారు.

ఇప్పుడే సాక్షుల, నిందితులను అంతమొంచే వేట మొదలు పెట్టినట్టు తెలిస్తోంది, చాలా మంది ప్రాణాలు తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలని.. వివేకా ను హత్య చేసినవవాళ్ళే ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

జూమ్ యాప్ లోకి కూడా వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు… లోకేష్ ను చూసి వైసీపీ భయపడుతుంది, అందుకే లోకేష్ ని టార్గెట్ చేస్తోందని చురకలు అంటించారు. ఈ నెల 15 న చోడవరం లో మినీ మహానాడు జరుగుతుంది.. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. 18 న చీపురుపల్లి లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version