రేపటి నుంచి కొడాలికి కౌంట్ డౌన్..గుడివాడలో ఇక నీ పతనమే – బుద్దా వెంకన్న

-

రేపటి నుంచి కొడాలి కి కౌంట్ డౌన్..గుడివాడలో ఇక నీ పతనమేని కొడాలి నానికి వార్నింగ్‌ ఇచ్చారు. టిడిపి నేత బుద్ధ వెంకన్న. సీఎం జగన్ విద్యార్థులకు ల్యాప్ ట్యాబ్ ఇస్తా అని మోసం చేసాడు..చిన్న పిల్లల విద్యా మీద కూడా అవినీతి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. లిక్కర్ మీద ఆదాయం కూడా తాడేపల్లి ప్యాలెస్ కి పోతున్నాయన్నారు.

అమ్మఒడి డబ్బులు పిల్లలు పుస్తకాలకి కూడా సరిపోవన్నారు.. వెల్లంపల్లి అవినీతి అడిగితే ఒక వ్యక్తి ని జైల్లో పెడతారా.. ? 1 తేదీన నుండి టీడీపీ తరుపున ల్యాప్ ట్యాబ్ ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కొడాలి నానికి చంద్రబాబు అంటే చెమటలు పడుతున్నాయి..వెన్నుపోటు అనే కొడాలి 2004చంద్రబాబు చేతి నుండి బిఫామ్ ఎందుకు తీసుకున్నావని పేర్కొన్నారు. సొంత బాబాయ్ ని నరికి చంపించిన ఘనత సీఎం జగన్ అని.. గుడివాడ లో జరిగే మినీ మహానాడు కొడాలి నాని పతనం నాంది పడుతుందని ఎద్దేవా చేశారు. కొడాలి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు టిడిపి నేత బుద్ధ వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version