టాలీవుడ్ పరిశ్రమకు పెద్దన్న చిరంజీవే : సి.కళ్యాణ్

-

చిరంజీవి పెద్ద కదాన్న ఆయనే టాలీవుడ్ కు పెద్డ అని సి.కళ్యాణ్ అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు సన్మానం చేసేందుకు త్వరలోనే చిరంజీవిని కలుస్తామని చెప్పారు. సిఎం జగన్ సినిమా టికెట్ల ధరలు పెంచడం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందని.. తెలుగు సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అన్నారు.

ముఖ్యమంత్రికి వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని.. సినీ పరిశ్రమ వైజాగ్ కూడా ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని సి.కళ్యాణ్ ప్రకటన చేశారు. వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఛాంబర్ మరోసారి సమావేశమై చర్చిస్తామని.. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతామని వెల్లడించారు సి.కళ్యాణ్. మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎన్నో సంవత్సరాల సమస్యకు పరిష్కారం అని చెప్పారు. ఇదే జీవో భీమ్లానాయక్ ముందు వచ్చి ఉంటే మరింత పాజిటివ్ గా ఉండేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version