ఎడిట్ నోట్ : బొత్స కోసం జగనన్న త్యాగం ? వావ్ వావ్

-

మంత్రి బొత్స కోసం జ‌గ‌న్ ఓ త్యాగం చేశార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.ఆయ‌న కుమారుడి వివాహ రిసెప్ష‌న్ వేడుక‌ల నిమిత్తం ఏకంగా ఒక రోజు అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. అంటే రేపు 8 మార్చి 2022 న విజ‌య‌న‌గ‌రం, సీతం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో జ‌రిగే వెడ్డింగ్ రిసెప్ష‌న్ కు ఎమ్మెల్యేలూ, మంత్రులూ హాజ‌రయ్యేందుకు వీలుగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌ది విప‌క్ష పార్టీ ఆరోప‌ణ.

ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఇటీవ‌ర‌ల ఆక‌స్మికంగా మ‌ర‌ణించిన ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి కి స‌భ నివాళి అర్పించిన త‌రువాత స‌భ వాయిదా ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ ప‌దిన స‌మావేశం కానుంది. ప‌ది, ప‌దకొండు తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి స‌భ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సంబంధిత తీర్మానం పై చ‌ర్చించ‌నుంది.

చ‌ర్చ ముగియ‌గానే ప‌ద కొండో తారీఖునే ఆర్థిక మంత్రి బుగ్గ‌న బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తారు. కానీ టీడీపీ మాత్రం దీనిని రాజ‌కీయం చేస్తోంది.పెళ్లి వేడుక‌ల కార‌ణంగానే అసెంబ్లీకి సెల‌వు ఇచ్చార‌ని బాబు చెబుతున్నారు. ఏదేమ‌యినా ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న‌ది ఓ వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version