పచ్చిమిర్చితో కొవ్వు తగ్గుతుందా..?

-

పచ్చిమిర్చి అంటే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు కొందరు. అయితే దీంతో వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి అంటే అందరికీ భయం. ఎంతో కారంగా.. ఘాటుగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా తినడం కన్నా.. కూరల్లో వేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొందరు వ్యక్తులు పచ్చిమిర్చిని డైరెక్ట్‌గానే తినేస్తుంటారు. మజ్జిక, అంబలి, రాగి జావ వంటి ఆహారంపై పచ్చిమిర్చిని తినేస్తుంటారు. అయితే పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి మిర్చి
పచ్చి మిర్చి

కొవ్వును కరిగిస్తుంది..
శరీరంలో మెటబాలిజంను ప్రేరేపించేందుకు క్యాస్సేసియన్ అనే పదార్థంలో ఎంతో తోడ్పడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సాధారణంగా శరీరంలో తెలుపు, గోధుమరంగుల్లో కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్వ చేస్తుంది. గోధుమ రంగు కొవ్వు కణాలను కరిగించేలా చేస్తుంది. పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ ఉందని అమెరికాలోని వ్యోమింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు.

గుండె పనితీరు మెరుగు..
పచ్చి మిరపకాయలు గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. ప్రమాదకరమైన అథెరోస్కెల్ రోసిస్‌ను ఇది నివారిస్తుంది. రక్తంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. మిరపలోని రసాయనాలు ధమనుల్లో కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టేందుకు దారితీసే కణాల సమూహం ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గిపోతాయి.

జీర్ణశక్తిని పెంచి.. అజీర్తిని తగ్గిస్తుంది
పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించడంతోపాటు పక్షవాతాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ వంటలో రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది. దెబ్బలు తగిలినప్పుడు రక్తాన్ని కారనివ్వకుండా గడ్డకట్టేలా చూస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి..
మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

పోషకాలు మెండు..
పచ్చి మిరపకాయల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్-బి6, విటమిన్-ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

నియంత్రణలో శరీర ఉష్ణోగ్రత..
చైనీస్‌ వంటకాల్లో పచ్చిమిర్చికి ప్రాముఖ్యత ఎక్కువ. పచ్చిమిరపకాయ తినడం వల్ల శరీరంలోని అనవసరమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయని వారి నమ్మకం. దీంతో శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలు చేస్తుందని వారు భావిస్తారు. చర్మం కాంతివంతం అవుతుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సి కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news