ఓటీటీలోకి ధనుష్ కెప్టెన్ మిల్లర్..!

-

ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఓటిటిలోకి వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించారు. అరుణ్ మాతేశ్వర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో రెండు వందల కోట్ల కలెక్షన్లని ఈజీగా రాబడుతుందని అనుకున్నారు. కానీ ధనుష్ నటన బాగున్నప్పటికీ కథ లో పెద్దగా పట్టు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.

బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని మాత్రమే సొంతం చేసుకుంది వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ 45 కోట్ల కి పైగా షేర్లు అని రాబట్టింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news