తల్లిని కాపాడి ..కాల్వలో గల్లంతైన ఎస్సై

-

విజయవాడ సమీపంలోని అవనిగడ్డ – విజయవాడ కరకట్టపై అదుపుతప్పిన కారు కాల్వలోకి దూసుకెళ్లింది. తల్లీ కుమారుడు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి అవనిగడ్డకు వస్తున్న కారు..విజయవాడ సమీపంలోని పాపవినాశనం దగ్గరకు రాగానే అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. దీంతో తన తల్లిని రక్షించి ఒడ్డకు చేర్చిన కుమారుడు, అనంతరం కారులో ఉన్న బ్యాగు కోసం వెళ్లి కారుతోపాటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.ఆ వ్యక్తి కోట వంశీధర్ , కాగా ఆయన కాకినాడ సమీపంలోని రామచంద్రాపురం ఎస్సైగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version