రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుడితో సహా 9 మంది దుర్మరణం

-

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న వారి ఆనందాన్ని ఘోర ప్రమాదం దూరం చేసింది. పెళ్లికి వెళ్తున్న కారు నదిలో పడిపోయి ప్రమాదం చోటు చేసుకుంది. కోటాలోని ఛోటీ పులియా నుంచి చంబల్ నదిలో కారు పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న 9 మంది చనిపోయారు. ఇందులో వరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరంతా  ఉజ్జయిన్ లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. కారు వెళ్తున్న క్రమంలో ఓ వంతెన వద్ద చిన్న కల్వర్టును ఢీకొని నదిలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు 9 డెడ్ బాడీలను రికవరీ చేశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నదిలో నుంచి బయటకు తీసేందుకు క్రేన్లను ఉపయోగించారు. క్రేన్ సహాయంతో నదిలో నుంచి కారును వెలికి తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version