పేరెంట్స్ నిర్లక్ష్యం, వాహనదారుడి వేగం కారణంగా అమాయక బాలుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. అప్పటివరకూ ఆనందంగా ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటి బయట సైకిల్ మీద ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడి పైనుంచి అతివేగంగా ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది. బాలుడిని కారు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, బాలుడు ఇంటిముందు ఆడుకుంటూ ఒక్కసారిగా రోడ్డు మీదకు వెళ్లగా.. వేగంగా వచ్చిన కారు బాలుడిని గమనించకుండా మీద నుండి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.