కోడలికి వేధింపులు..ఎంపీ పై కేసు.. !

-

సాధారణ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన కొందరు నాయకులే తప్పులు చేసి చిప్పకూడు తినేందుకు సిద్ధమవుతుంటారు. తాజాగా ఓ ఎంపీ కూడా అలాంటి పనే చేశాడు. కట్నం కోసం కోడలిని వేధించాడు దాంతో అతడి పై వరకట్న కేసు నమోదు అయింది. ఈ ఘటన ఒడిస్సా లో చోటు చేసుకుంది. ఒడిస్సా కు చెందిన ఎంపీ భర్త్రు హరి మహతాబ్ తో పాటు ఆయన కుమారుడు మరియు భార్య కట్నం కోసం కోడలి ని వేధించిన ట్టు భూపాల్ మహిళా పోలీస్ స్టేషన్ లో కోడలు ఫిర్యాదు చేసింది.

అదనపు కట్నం కోసం తన భర్తతో పాటు ఇంటి సభ్యులు కూడా వేధిస్తున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంపీ పై అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా తాను పుట్టింటికి వెళ్లి వస్తే తనను ఇంట్లోకి రానివ్వలేదు అని కోడలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక ఈ వార్త నెట్టింట చక్కెర్లు కొట్టడంతో ఎంపిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news