ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైసిపి కార్యకర్త సింగయ్య మృతి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ప్రవేట్ వెహికల్ అని చెప్పారు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనిపై ఆయన.. తాజాగా వైరల్ అయిన వీడియో గురించి ప్రస్తావించారు.
అప్పుడు నాకు ఉన్న సమాచారం మేరకు అలా చెప్పినట్లు స్పష్టం చేశారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. డ్రోన్ అలాగే స్థానికులు తీసిన వీడియోలు చూసి దర్యాప్తు చేశామన్నారు. ఈ తరుణంలోనే డ్రైవర్ రమణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని, అలాగే విడదల రజిని పేర్లను నిందితులుగా చేర్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.