హీరో సూర్య పై కేసు నమోదు !

-

హీరో సూర్య పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించాలని ఆదేశాలిచ్చింది సైదాపేట మెజిస్ట్రేట్ కోర్టు. జైభీమ్ మూవీ వివాదంపై హీరో సూర్య తో పాటు జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ పై వేలచ్చేరి పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలోఇదే పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేదు.

దీంతో ఆయన సైదాపేట మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టుకు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. కాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది. గిరిజనులకు అండగా నిలిచిన లాయర్ చంద్రు కదే ‘జై భీమ్ ‘. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా జై భీమ్. అయితే ఈ సినిమా పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version